17-08-2025 12:57:15 AM
-మామునూర్ విమానాశ్రయ భూ నిర్వాసితులు
- వరంగల్ నెక్కొండ ప్రధాన రహదారిపై బాధితుల ధర్నా
వరంగల్, ఆగస్టు 16 (విజయక్రాంతి): మామునూరు విమానాశ్రయ భూ నిర్వాసితులు ఆందోళన బాటపట్టారు. వరంగల్ నక్కలపల్లి ప్రధాన రహదారి వద్ద సర్వేకు వచ్చిన అధికారులను శనివారం గుంటూరుపల్లివాసులు అడ్డుకున్నారు. మామునూర్ విమానాశ్రయం కోసం గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి భూసేకరణకు ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్వాసితులకు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధర చెల్లించడంతోపాటు గ్రామాలకు సౌకర్యాలు కూడా ఇచ్చింది.
ఇటీవల నిర్వాసిత రైతులతో జరిగిన సమావేశంలో ఒక ఎకరానికి రూ.కోటి 20 లక్షలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే బహిరంగ మార్కెట్ లో సుమారు ఐదు కోట్ల రూపాయలు విలువచేసే భూమికి రూ.కోటి 20లక్షలు చెల్లించ డం సబబు కాదని రైతులు తేల్చి చెప్పారు. కనీసం వరంగల్ నెక్కొండ ప్రధాన రహదా రి వెంట ఉన్న భూములకైనా రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
అధికారులు స్పందించకపోవడంతో శనివారం వరంగల్ నెక్కొండ ప్రధాన రహదారిపై రైతులు భూ నిర్వాసితులు మార్కెట్ ధరకు అనుగుణంగా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. దీంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.