15 March, 2026 | 7:42 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

అక్రమ మైనింగ్ ఆపాలంటూ ఫిర్యాదు

28-01-2026 12:00 AM

అలంపూర్, జనవరి 27: వడ్డేపల్లి మండలం బుడమొర్సు గ్రామ శివారులో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను ఆపాలంటూ గ్రామస్తులు తాహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తాహాసిల్దార్ శివకుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. గ్రామస్తులు మాట్లాడుతూ... గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వందల కొద్ది సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా అక్రమ మట్టిని రవాణా చేస్తున్నట్లు ఆరోపించారు. అధికారులు అడ్డుకట్ట వేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరారు.