17 April, 2026 | 11:56 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

డ్యామ్, కాలువల మరమ్మత్తుల పనులు త్వరిత గతిన పూర్తి చేయండి

21-11-2025 10:45 PM

ఇరిగేషన్ శాఖ-l అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు

భద్రాచలం,(విజయక్రాంతి): తాలిపేరు ప్రాజెక్టు డ్యాం, కాలువలపై అగ్రిమెంట్ అయిన పనులుచేయించుటకు, రెండవ పంటకు నీటి పంపిణీ అంశాల చర్చించే నిమిత్తం 3వ జోన్ ఆయకట్టు రైతులతో ఈ నెల 13వ తేదీన నర్సాపురం రైతు వేదికలో రైతులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించిన విషయం విధితమే. ఈ తరుణంలో శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించారు.

ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని అన్ని జోన్లు (జోన్ 1,2,3) లో ప్రస్తుతం ఉన్న ఆరుతడి పంటలకు జనవరి నెల చివరి వరకు నీటిని అందించి తదనంతరం డ్యామ్, కాలువల మరమ్మత్తుల పనులు త్వరిత గతిన చేయించమని ఆదేశించారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం రెండవ పంటకు (రబీ) 3వ జోన్ గల పంటలకు మీరు అందించే విధంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఎస్.ఏ. జానీ, డీఈఈలు తిరుపతి, మధుసూదన్ రావు, రైతులు వీ.కోటేశ్వరరావు, లంక అబ్బులు, రావులపల్లి రవికుమార్, సీపీఐ నాయకులు, తాలిపేరు ప్రాజెక్టు సిబ్బంది, పాల్గొన్నారు.