17 April, 2026 | 11:57 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

జన విజ్ఞాన టాలెంట్ టెస్ట్‌లో సూది రెడ్డి స్కూల్ విద్యార్థులు ప్రభంజనం

21-11-2025 10:48 PM

భద్రాచలం,(విజయ క్రాంతి): జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నాడు దుమ్ముగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో సూది రెడ్డి నాగిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపురం పాఠశాల నుండి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం నుంచి సోయం సానియా, రాచకొండ మహిత, పూజారి దేవి ప్రియ మరియు తెలుగు మీడియం నుండి పెనుగొండ రక్షిత, కొమరం ప్రశాంత్, పొడిశెట్టి కార్తీక్ ఎంపిక కావటం జరిగింది.

ఈ విద్యార్థులు దుమ్ముగూడెం మండలం తరపున నవంబర్ 28న కొత్తగూడెంలో జరిగే జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో పాల్గొంటారు. ఎంపిక కాబడిన ఈ విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి సమ్మయ్య  మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపురం ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు చేతులు మీదుగా ప్రశంస పత్రాలు విద్యార్థులు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బేకంట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విజయానికి కారుకులైన పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయులందరూ విజయం సాధించిన  విద్యార్థులను అభినందించడం జరిగింది