23-11-2025 07:39:24 PM
కరీంనగర్ (విజయక్రాంతి): నూతన డీసీసీ అధ్యక్షులగా నియమితులైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఆదివారం జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే నివాసంలో చిత్రపటం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట డీసీసీ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు నూనె గోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్, గంగాధర మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమళ్ళ మనోహర్, కోల ప్రభాకర్, బైరిశెట్టి సంపత్, కుంభాల రాజకుమార్, దొంతి గోపి, తదితరులు ఉన్నారు.