05-08-2025 08:49:25 PM
కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ఈ నెల 6 న న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక రైలులో దాదాపు 50 మంది బీసీ నాయకులు ఢిల్లీ తరలి వెళ్లగా కరీంనగర్ డిసిసి అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్ర సంతోష్ కుమార్, పిసిసి మెంబర్ పత్తి కృష్ణ రెడ్డి, ఆశంపల్లి శ్రీనివాస్, డీసీసీ పీఆర్ఓ దొంతి గోపి తదితరులు మంగళవారం ఢిల్లీకి చేరుకోవడం జరిగింది.