17 April, 2026 | 3:48 AM

మధ్యాహ్నం భోజనం ప్రారంభం

02-01-2026 07:35 PM

మోతే,(విజయక్రాంతి): మండల పరిధిలోని రాఘవ పురం ఎక్స్ రోడ్డు లోని ప్రాధమిక పాఠశాలలో శుక్రవారం  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి మధ్యాహ్నం భోజనం ప్రారంభం చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన సన్న బియ్యం భోజనం పిల్లలకు వండి పెట్టి ఎలాంటి లోపాలు లేకుండా  సౌకర్యం కల్పించాలని పిల్లల తల్లి దండ్రులు నెలకు ఒక సారైన పాఠశాల కు వెళ్ళి సదుపాయాలు సమీక్షా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడి లింగయ్య, రాఘవ పురం సర్పంచ్ మద్ది మంజుల భాస్కర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి సంపత్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.