7 April, 2026 | 11:19 AM

Breaking News

బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •   జలాశయాలు డెడ్ స్టోరేజ్ : తాగునీటికీ కటకట!   •  

గట్లమల్యాలలో క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసం

03-10-2025 06:29 PM

నంగునూరు: మండల పరిధిలోని గట్లమల్యాల గ్రామంలో దసరా పండుగ సందర్భంగా రంగు పరశురాములు జ్ఞాపకార్థం ఆయన మనుమండ్లు క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు.హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్‌లో బుల్స్ టీం అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి 10000 ప్రైజ్ మనీని గెలుచుకుంది.రన్నరప్‌గా ముదిరాజ్ కింగ్స్ జట్టు నిలిచి 5000 నగదు బహుమతిని సొంతం చేసుకుంది. ఈ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను రంగు పరశురాములు గౌడ్ మనుమండ్లు అయిన రంగు మనోజ్, శ్రేయస్, చింటూ, ప్రమోద్, వినయ్, అనుదీప్ గౌడ్లు తదితరులు కలిసి నిర్వహించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచేందుకు ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని,యువకులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం గ్రామంలో క్రీడా ఉత్సాహాన్ని నింపి, పండుగ వాతావరణాన్ని మరింత పెంచింది. తమ తాత జ్ఞాపకార్థం యువతను ప్రోత్సహిస్తూ టోర్నమెంట్ నిర్వహించిన మనుమండ్లను గ్రామస్తులు అభినందించారు.