4 April, 2026 | 3:09 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

ఆరుతడి పంటలపై మక్కువ పెంచండి

03-07-2025 12:00 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్‌నగర్, జూలై 2 (విజయ క్రాంతి) : రైతులు ఆరుతడి పంటల పై మక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఏ.డి.లు, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ ఆహార భద్రత పథకం సహకారంతో అంధించిన కంది పంట విత్తనాల మినికిట్స్ ను రైతులకు జిల్లా కలెక్టర్ ఉచితంగా పంపిణీ చేశారు.

సందర్భంగా కలెక్టర్ అప్పు దినుసుల పంటలు సాగు చేయడం వల్ల రైతులకు అత్యధిక లాభాలు చేకూరి అవకాశం ఉంటుందని తెలిపారు.  అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అదికారి బి.వెంకటేష్ మాట్లాడుతూ పప్పు దినుసుల పంటలు అధికంగా సాగుచేయాలని, విస్తీర్ణం పెంచుట వలన గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. ప్రతి రైతు మార్కెట్లో పంటలు విక్రయించి అధిక లాభాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమoలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు,  ఏఈఓ లు, పాల్గొన్నారు.