31-07-2025 11:37:35 AM
హైదరాబాద్: సోషల్ మీడియా పుణ్యమా అంటూ సైబర్ నేరాలు ఘోరంగా పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే పండు ముసలోల్లా వరకు సైబర్ గాళ్ల ఉచ్చులో పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఆటలకు మన పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Police ) గత వారం రోజుల్లో 18 సైబర్ క్రైమ్ కేసులను గుర్తించి, దేశంలోని వివిధ రాష్ట్రాలలో 31 మంది నేరస్థులను అరెస్టు చేశారు. ఈ 31 మంది అరెస్టులలో 19 మంది ట్రేడింగ్ మోసానికి పాల్పడిన వ్యక్తులున్నారని పోలీసులు పేర్కొన్నారు. ముఠాగా ఏర్పడి సైబర్ నేరాలకు కుట్ర పన్నినందుకు తొమ్మిది మంది నేరస్థులను అరెస్టు చేసిన పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. పోలీసులు రెండు కార్లు, ఒక ల్యాప్టాప్, 32 మొబైల్ ఫోన్లు, ఏడు చెక్ బుక్లు, రూ.82,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాలంలో అధికారులు విజయవంతంగా ప్రాసెస్ చేసి, 60 కేసులలో 283 రీఫండ్ ఆర్డర్లను కోర్టు నుండి పొందారు. బాధితులకు తిరిగి చెల్లించడానికి రూ. 1,20,77,214 మొత్తాన్ని పొందారు. సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తున్న పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు చెబుతున్నారు.