23 May, 2026 | 7:25 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

ప్రభుత్వానికి నేడు కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్

31-07-2025 10:54 AM

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నేడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక(Kaleshwaram Commission Report) సమర్పించనుంది. 2024 మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) ఆనకట్టలకు సంబంధించి ఏడాదికి పైగా విచారణ చేశారు. 155 మందిని విచారించిన పీసీ ఘోష్ కమిషన్ సాక్ష్యాలు నమోదు చేసింది. ఇంజినీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారించింది. గత ప్రభుత్వ పెద్దలు, ఇతరులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలు, విధానపర నిర్ణయాలపై కమిషన్ విచారించింది. రీ ఇంజినీరింగ్, ఆనకట్టల డిజైన్, లోకేషన్, నిర్మాణం, నాణ్యతపై కమిషన్ దృష్టి సారించింది. టెండర్ ప్రక్రియ, అంచనాల పెంపు, చెల్లింపులు, కాళేశ్వరం కార్పొరేషన్(Kaleshwaram Corporation), ఇతర అంశాలపై  కమిషన్ విచారణ జరిపింది.