16-10-2025 11:32:01 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట మండలంలోని దేవాపూర్ సల్పల వాగు ప్రాంతంలో ఆదివాసీలు గురువారం దండారి సంబరాలను ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్ రెడ్డిలకు ఆదివాసి సంఘం నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. గుస్సాడీ నృత్యాలతో సందడి చేశారు. సాంప్రదాయ రీతిలో నిర్వహించిన ఆదివాసీల కార్యక్రమాలు అలరించాయి.