calender_icon.png 30 June, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటే తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడం..

29-06-2025 10:52:34 PM

జై తెలంగాణ అనని వ్యక్తి తెలంగాణ సీఎం..

సాయి చంద్ విగ్రహ ఆవిష్కరణ...

మాజీమంత్రి తన్నీర్ హరీష్ రావు..

వనపర్తి (విజయక్రాంతి): తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఏనాడు జై తెలంగాణ అని అననోడు నేడు తెలంగాణ సీఎం అయ్యాడని అలాంటి వ్యక్తి తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు మాజీ సీఎం కేసిఆర్(Former CM KCR) ఆనవాళ్లను లేకుండా చేస్తానని చెబుతున్నాడని కేసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణను లేకుండా చేయడం అని ఆది ఎవరి వల్ల కాదని మాజీమంత్రి తన్నీర్ హరీష్ రావు(BRS MLA Thanneeru Harish Rao) అన్నారు. కవి, రచయిత గాయకుడు, మాజీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ 2వ వర్ధంతి సందర్బంగా ఆదివారం అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మాజీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజిని సాయి చంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి చంద్ విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభకు ఆయన హాజరు అయ్యారు.

ముందుగా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రాంమోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్సి నవీన్ కుమార్, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లతో కలిసి సాయి చంద్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సాయి చంద్ ను ఎప్పుడు గాయకుడిగా చూడలేదు ఒక కుటుంబ సభ్యుడు నా తమ్ముడిగా చూసుకున్నానని ఇంత చిన్న వయసులో మన అందర్నీ విడిచిపెట్టి వెళ్లడం బాధాకరమన్నారు. సాయి చంద్ కవి, గాయకుడు ఒక ఉద్యమకారుడు తెలంగాణలోని ప్రజలందరి మనసులో నిలిచిపోయాడన్నారు.

సాయి చంద్ ఒక మాట ఒక తూట పాట తూట పేలుతుండే ఆది ఏ పాట అయిన సరె గుండెను సముద్రం చేయగలిగించె ఒక్క సాయిచంద్ కే స్వంతం. రాతి బొమ్మలోనే పాట సాయి ఎన్ని సార్లు పాడితే అన్ని సార్లు నా కండ్లలో నీళ్లు తిరిగేవి. డాక్టర్ అంబేద్కర్ మీద పాడిన ప్రతి పాట కండ్లకు కట్టినట్లు ఉండేదని గుర్తుకు చేసుకున్నారు  సాయి చంద్. మూడు సార్లు జైలుకు పోయిన ఏనాడు బాధపడలేదు ఆనాటి సమైక్యాంధ్ర వాళ్లు ఎన్ని అఫర్లు ఇచ్చిన తలవొగ్గలే, లాఠీ దెబ్బలు, తుపాకీ పెట్టిన, పదవులు అఫర్లు పెట్టిన నా పార్టీ బిఆర్ఎస్ తెలంగాణ రాష్టం సాధించడం లక్ష్యం అని కేసిఆర్ వెంట నిలబడిన అసలైన ఉద్యమ కారుడు సాయి చంద్ అని ఆయన గుర్తు చేశారు. 

కొందరు తొందరగా మెట్లు ఎక్కాలని, పదవులు కావాలని పార్టీలు మారుస్తుంటారు రంగులు మారుస్తుంటారు కానీ సాయి నిజాయితీ గా పని చేసేవాడన్నారు. జై తెలంగాణ అనని వ్యక్తి ఈరోజు తెలంగాణ కు ముఖ్యమంత్రి అయ్యాడని ఈరోజు సాయి చంద్ ఉండివుంటే గుండె ఎంత భాద పడేదో నన్నారు. ఒక్కనాడైన అన్నాడా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని ఈనాడు ఎం అంటున్నాడు కేసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాను అని అంటున్నాడు కేసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడం. కేసిఆర్ అంటే ఉద్యమం, అభివృద్ధి, సంక్షేమం. కేసిఆర్ ను ఇన్ని మాటలు అంటుంటే మనం ఊరుకుని ఉన్నాం సాయి చంద్ బతికి ఉండి ఉంటే భూమి దద్దరీల్లెలా పోరాటం చేసేవాడు ఎన్ని పాటలు పాడేవాడన్నారు.

మొన్న బిఆర్ఎస్ రజతోత్సవం జరుపుకున్నాం ఆ సభలో వేదిక పైన ఉన్నప్పుడు నా పక్కవాళ్ళతో సాయి చంద్ లేని లోటు కనిపిస్తుందని నేను జ్ఞాపకం చేసుకున్నానని ఆయన గుర్తు చేసారు. సాయి చంద్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం అంటే నా గుండె బరువు ఎక్కుతుంది. ఇంత చిన్న వయసులో  సాయి మనల్ని వదిలిపోవడం చాలా బాధాకరం. కష్టాన్ని నమ్ముకోండి ఉన్నత స్థానానికి ఎదగాలని సాయి చంద్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారుభర్త ఆశయాల కోసం రజిని ముందుకు పోతుందని మీ కుటుంబానికి ఎల్లపుడు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

జై తెలంగాణ ప్రభుత్వం పోయింది నై తెలంగాణ ప్రభుత్వం వచ్చింది...

తెలంగాణ మలి దశ ఉద్యమం తరువాత జై తెలంగాణ ప్రభుత్వంను వచ్చిందని అలాంటి జై తెలంగాణ ప్రభుత్వం పోయిందని ఇప్పుడు నై తెలంగాణ ప్రభుత్వం వచ్చిందన్నారు. 

సిద్దిపేట కోడి కూత సాయి చంద్..

సిద్దిపేట కోడి కూత సాయి చంద్. అంటే ఇది ఏందో అనుకుంటారా సిద్దిపేట ప్రజలు సాయిచంద్ పాటతోనే నిద్రలేస్తారు. తడి పొడి చెత్త మీద పట్టణం మొత్తం క్లీన్ చేయాలనీ ఆలోచిస్తున్న సమయంలో సాయి వచ్చి నాతో మాట్లాడి ఒక పాట రూపంలో ఇస్తే దానిని మున్సిపాలిటీ ట్రాక్టర్లకు పెట్టిన ఉదయం 5 గంటలకు ప్రజలతో పాటు నేను ఎప్పుడైనా సిద్దిపేటలో ఉన్న సమయంలో సాయి పాట నా చెవిలో వినిపిస్తూనే ఉంటుందని అందుకే సిద్దిపేట కోడి కూత సాయి చంద్ అని అ పాట వినప్పుడల్లా చాలా భాద అనిపిస్తుంది. ప్రతి సామాజిక అన్ని కార్యక్రమాలో సాయి పాట వినిపిస్తూనే ఉంటుంది. సాయి ఆలోచనలు, ఆశయాలను సాధించేలా అందరం ముందుకు సాగాలి.

సాయి చంద్ పాట రూపంలో మన మధ్యలో ఉన్నాడు... మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

సాయి చంద్ మన మధ్యలో లేకపోయినా పాట రూపంలో ఎప్పటికి సాయి చంద్ మన మధ్యలో ఎప్పుడు ఉన్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) అన్నారు. కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేది కాదన్నారు. 

తెలంగాణలో మళ్ళీ విషం చీమ్ముతున్న కొన్ని మీడియాలు...

మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..

తెలంగాణ సమాజానికి తీరని లోటు సాయి చంద్ మరణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Former Minister Singireddy Niranjan Reddy) అన్నారు. హైదరాబాద్ సంస్థానం నుండి మొదలుకుని తెలంగాణ ఉద్యమం వరకు బలమైన ఆయుధం ఒక పాట. పాలమూర్, తెలంగాణ కష్టాలను చూసి తనను ఆకర్షించి ముందుకు సాగిన కవి గాయకుడు సాయి చంద్. ఈ రోజు పరిస్థితులను చూస్తుంటే గత 25 ఏండ్ల క్రితం తెలంగాణ మలి దశ ఉద్యమం గుర్తుకు వస్తుందని. మీడియా అని కొంతమంది ముసుగు ధరించి తెలంగాణకు వ్యతిరేకంగా డిబేట్లు పెట్టిండ్రు తెలంగాణ వచ్చినట్లే వచ్చి పోయిందని ఎంతో మంది అమరవీరులు ప్రాణ త్యాగం చేసుకుండ్రు.

మనం మీద విషం చీమ్ముతున్న కొన్ని మీడియా సంస్థలకు ఆంధ్రాలో చంద్రబాబు తెలంగాణలో చంద్రబాబు చెంచా ముఖ్యమంత్రి అయ్యే వరకు కొమ్ములు వచ్చాయాని, ఇష్టరీతీగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇష్టం ఉన్నట్లు చేస్తే కొడుకుల్లారా అని ఘాటుగా ఘాటుగా విమర్శించారు. కృష్ణ నది నీళ్లకు గండి పెట్టారు గోదావరి నీళ్లను తీసుకుని పోవాలని చేస్తుంటే హరీష్ రావు లేచే సరికి ఊరుకుని ఉన్నారన్నారు. జూరాల గేట్లకు రిపీర్లు చేయడానికి చేతకాదు కానీ ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ప్రాజెక్టు లో సిల్ట్ ఉంది తీసివేస్తాం అని చెబుతున్నారు 40 ఏండ్ల కింద కట్టిన ప్రాజెక్టు లో సిల్ట్ ఉందన్న సంగతి కొత్తగా చెప్పి వెళ్ళాడన్నారు

సాయి చంద్ లేని లోటు 2023 ఎలక్షన్ లో తెలిసింది... మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 

సాయి చంద్ లేని లోటు 2023 ఎలక్షన్ లో తెలిసిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి(Former Minister Laxma Reddy) అన్నారు. ఏ సభ, సమావేశం అయిన సాయి చంద్ ఆట, పాట తో ఆకట్టుకునేవాడు.  రాజకీయ రంగంలో ఎదుగుతున్న తరుణం లో సాయి చంద్ ను కోల్పోవడం బాధాకరం.  రాష్ట్రము లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం అవసరం అనిపిస్తుంది. 

సాయి మరణించిన రోజులా కాదు జన్మించిన రోజుల ఉంది... మాజీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజిని సాయి చంద్ 

మీ అందరిని చూస్తుంటే సాయి చంద్ మరణించిన రోజులా లేదని మళ్ళీ జన్మించిన రోజు లా ఉందని మాజీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజిని సాయి చంద్ అన్నారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే లు అల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రాంమోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ... పాలమూర్ జిల్లాలో ఉన్న ఉద్యమ కారుల అందరికి సాయి చంద్ స్ఫూర్తి. మంచి భవిష్యత్ ఉన్న సాయి చంద్ మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ఇప్పటికి కండ్లలో సాయి చంద్ మెదులుతూనే ఉంటాడు. సాయి చంద్ పాట రూపంలో మన మనసులో ఉంటాడు. కాళేశ్వరం, గురుకులాలు, లగచెర్ల, ఇతనాల్ రైతులు, తెలంగాణ లోని ప్రతి ఒక్కటి సాయి చంద్ తిరిగి రావాలని పాట కోరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాయి చంద్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.