calender_icon.png 30 June, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ పిల్లలకు ఆర్థిక సాయం అందజేసిన సాయికుమార్..

29-06-2025 10:35:28 PM

మునిపల్లి: మండలంలోని పెద్ద గోపులారం గ్రామానికి చెందిన బేగారి రమేష్, అనితలు ఇటీవల ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వీరికి ముగ్గురు సంతానం ఉండడంతో వారు అనాథలయ్యారు. ఈ విషయాన్ని పిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్(BRS State Leader Paithara Saikumar) తనవంతుగా అనాధ పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పైతర సాయికుమార్ మాట్లాడుతూ... అనాధలుగా ముగ్గురు పిల్లలకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల మాజీ ఎంపీపీ చంద్రయ్య, నాయకులు దండు బక్కన్న, భాగయ్య, హైద్లాపూర్ బక్కన్న, మాజీ ఉప సర్పంచులు శివరాజ్, తుడుం దుర్గయ్య, నాయకులు సుల్తాన్, ఒగ్గు మోహన్, మునిపల్లి నవీన్, కలాల్ వెంకటేశం, నూనె శ్రీనివాస్, అంజి, పృద్వి, ప్రశాంత్, జనార్ధన్, బేగరి రవి, యాదయ్య, రాజు, బాల్ రాజ్, రవి, గొల్ల పాండు, శ్రీకాంత్, పీఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.