30-06-2025 12:00:00 AM
నిర్మల్ జూన్ 29 (విజయ క్రాంతి): బుడిబుడి నడకలు వేసి చిన్నారికి ప్లే స్కూల్లో ఫీజు 30000. దీనికి తోడు పుస్తకాలు నోటు కు బెల్టు బూట్లు ఇతర వస్తువుల పేరుతో మరో 10,000 చెల్లిస్తే అని అడ్మిషన్లు. ఇంత ఫీజు చెల్లించిన స్కూల్లో చిన్న పిల్లలకు ఆట స్థలాలు లేవు ఇరుకైన గదులు, కనీస సౌకర్యాలు కూడా కరువైన ఈ పాఠశాలలో వేల రూపాయల ఫీజును తీసుకుంటున్నారు.
ఇక కార్పొరేటర్ ఇస్తాయి టెక్నో స్కూల్ పేరుతో ఉన్న పాఠశాలలో అడ్మిషన్ కోసమే 2000 తీసుకుంటూ క్లాసులు బట్టి 30000 నుంచి 90 వేల వరకు రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూలు అడ్మిషన్లు తీసుకోగా వచ్చిపోయే వారికి 50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఇది నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక్క పాఠశాలలో జరుగుతున్న ఉదాహరణ ఇటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలలో విద్యు పేరుతో అధిక ఫీజులు వసూ లుచేసి దోపిడికి పాల్పడుతున్న అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. నిర్మల్ జిల్లా కేంద్రతోపాటు బైంసా ముధోల్ బా సర్ కుంటాల లోకేశ్వరం సారంగాపూర్ న ర్సాపూర్ కుబీర్ సోన్ లక్ష్మణ్ చందా మా మడ తదితర మండలాల్లో మొత్తం 268 ప్రై వేటు పాఠశాలలు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఈ పాఠశాలలో సుమా రు 13451 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్లే స్కూల్లో తో పాటు ప్రాథమిక పాఠశాల అప్పర్ ప్రైమర్ స్కూల్ హై స్కూల్స్ నిర్వహిస్తున్న వారు ఎల్కేజీని మొదలుకొని పదో తరగతి వరకు జిల్లాలో పాఠ శాల నిర్వహిస్తూ టెక్నో కార్పొరేట్ కొత్త కొత్త పేర్లతో ప్రవేశాలు తీసుకుని తల్లిదండ్రులను నమ్మించి ఆర్థిక దోపిడికి పాల్పడుతున్నారు.
పుస్తకాలు వస్తువుల పేరుతో వ్యాపారం
నిర్మల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డొనేషన్ ఫీజు తో పాటు స్కూల్ ఫీజు హాస్టల్ ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు తమ పాఠశాలలోని విద్యార్థి కావాల్సిన వస్తువులను పుస్త కాలను విక్రయించి వ్యాపార దందాకు తెరలేపుతున్నాయి. విద్యార్థి స్థాయిని బట్టి పుస్త కాల బరువు పుస్తకాలు ఉండాలని నిబంధన ఉన్న చిన్న పిల్లలకు మోతాదుకు మించి పుస్తకాలు నోట్ పుస్తకాలు కొనుగోలు చేయాలని అవి తమ పాఠశాలలోని దొరుకుతాయని తల్లిదండ్రులకు చెప్పి అధిక ధరల తో కొనుగోలు చేస్తున్నారు.
నోట్ పుస్తకాలతో పాటు బెల్టు బూట్లు బ్యాగు గొడుగులు ఇతర మెటీరియల్ సామాగ్రిని పాఠశాల ఆవరణలోని నిల్వ ఉంచి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు తల్లిదండ్రులు ఆరోపి స్తున్నారు. వీటిని బయట కొనుగోలు చేయకుండా కట్టడి చేస్తున్నారు. బయట మార్కెట్ కంటి ఈ పాఠశాలలో కొనుగోలు చేసిన ఈ వస్తువుల ధరలు రెట్టింపు ఉన్నాయని విద్యా ర్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఇలా విద్యార్థి స్థాయిని బట్టి వస్తువుల పేరుతో 3000 నుంచి 10000 వరకు సామాగ్రి కొనుగోలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుం ది స్కూల్ డ్రెస్సులు సైతం వారే సరఫరా చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు స్కూల్ బస్సులు ఏర్పాటు చేసి తమ బస్సుల్లోనే రావాలని అందుకు తాము నిర్వహించిన బస్సు చార్జీ చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు.
పిల్లల చదివే ముఖ్యమని భావిస్తున్న తల్లిదండ్రులు మంచి చదువులు చెప్పే పాఠశాలలకు వెళ్లి తమ పిల్లలను పాఠశాలలో చేర్పిస్తే ఆర్థిక దోపిడి గురై అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా సామాన్య మద్ద తు తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చదివించే సొమ్ముతో లేకపోవడంతో తమ పిల్ల లకు ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశపడిన అది సాధ్యం కాకూడదు సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొందరు తల్లిదం డ్రులు పేర్కొంటున్నారు.
విద్య హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు బోధన వృత్తి విద్యారత ఉండా లని పాట స్థలం డైనింగ్ హాలు విశాలమైన తరగతి గదులు ఇలా అన్ని వసతులు పర్యవేక్షించవలసిన విద్యాశాఖ అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు. నిర్మల్ బైంసా ముధోల్ ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే విద్యార్థి సంఘాల నేతలు ప్రైవేటు పాఠశాలలో అక్రమంగా నిల్వచేసిన పుస్తకాలు ఇతర సామాగ్రిని పట్టుకొని అధికారులకు ఫిర్యాదు చేసిన వారు తాత్కాలిక చర్యలు తప్ప శాశ్వత చర్యలు చేపట్టడం లేదని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్ట ఎందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో వైద్యం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రైవేటు విద్యా సంస్థల దోపిడి పై ప్రత్యేక దృష్టి పెట్టి నియంత్రణ చేపడితేని పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని వారి తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్ ఉన్న స్కూళ్లలో సౌకర్యాలు లేవు
నిర్మల్ బైంసా ఖానాపూర్ తదితర పట్టణాల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలలకు డిమాం డ్ ఉన్నప్పటికీ అక్కడ విద్యార్థులకు కావలసిన సదుపాయాలు సమకూర్చడంలో ప్రైవే టు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని వహిస్తుంది. గత రెండు మూడు ఏళ్లుగా హైదరాబాద్ కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థలు ఈ పట్టణాల్లో హైస్కూల్ ఏర్పాటు చేసి కార్పొరేట్ విద్య పేరుతో తల్లిదండ్రులను మాయ చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మూడు ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి ఫీజు లక్ష దాటిందంటే ఎవరికైనా నమ్మశక్యం కాదు. మంచి భోజ నం కార్పొరేట్ విద్య పోటీ పరీక్షలకు సీబీఎస్సీ తదితర వాడిని ఆశ చూపి అడ్మిషన్లను చేయించుకుంటున్నారు. ఒక్కొక్క క్లాస్ లో 40 మందికి ప్రవేశం కల్పిస్తామని వసతి గృ హంలో ఉండే వారికి పరిమితులు ఉంటాయని ముందుగా చెప్పినప్పటికీ పరిమితికి మించి విద్యార్థులను చేర్చుకున్నట్టు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రైవేట్ పాఠశాలలో స్థాయిని బట్టి ఫీజులు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ చైర్ పర్సన్ అధ్యక్షతన ఫీజుల నియంత్రణ కమిటీ పని చేయ వలసి ఉన్న అది ఎక్కడ పని చేయకపోవడం తో విద్యాసంస్థలు ప్రతివేట ఫీజులను పెం చుతూ తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని మో పుతున్నాయి. విద్యా కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాల్సిన అది ఎక్కడ అమలు కావడం లేదని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాటలు చెప్పే సార్లు కూడా కేరళ పేరుతో దోపిడికి పాల్పడుతున్నారు ఒక్కొక్క టీచర్ మూడు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ట్టు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. నాణ్యమైన భోజనం విద్యార్థులకు క్రీడలు నిర్వహించిన పాఠశాలలు తక్కువగానే ఉన్నాయి. ఫీజులను తగ్గించాలని తల్లిదండ్రులు కోరుతున్న అధికారులు మాత్రం కనీస చర్యలు చేపట్టకపోవడం పై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి