1 July, 2026 | 6:56 PM

Breaking News

అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •  

మహాలక్ష్మి పథకం @200 కోట్ల ప్రయాణాలు

23-07-2025 07:13 PM

హైదరాబాద్‌: ఎంజీబీఎస్ లో జరిగిన ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మహిళల ఉచిత ప్రయాణాల పురస్కరించుకొని నిర్వహించిన వేడుకలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు(Bhatti vikramarka) మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం(Telangana Mahalakshmi Scheme) ద్వారా ఇప్పటివరకు మహిళలు 200 కోట్ల ప్రయాణాలు చేసి, రూ. 6,680 కోట్లు ఆదా చేసుకున్నారు. ఉచిత ప్రయాణాల వలన ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 97శాతానికి పెరిగిందని సూచించారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు డీజిల్ బస్సుల స్థానంలో బ్యాటరీ బస్సులు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 3,000 బ్యాటరీ బస్సులు ఆర్డర్ చేసాం, మరో 500 బస్సులకు ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు ప్రయోజనం మాత్రమే కాకుండా ఆర్టీసీ ఆదాయం కూడా పెరిగిందని చెప్పారు. వడ్డీ లేని రుణాల ద్వారా మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ, ఆ బస్సులను ఆర్టీసీకి లీజుకు ఇచ్చే అవకాశాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. గత నెలలో కోటికి పైగా రుణాల చెక్కులను బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఇప్పటివరకు 2,400 కొత్త బస్సులు కొనుగోలు చేశామని వివరించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో రూ. 20 వేల కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టబోతున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.