15 June, 2026 | 11:41 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం

23-01-2026 08:36 PM

హనుమకొండ,(విజయక్రాంతి): దామెర మండలకేంద్రం లోని పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రోజున దామెరకు చెందిన భాషబోయిన రాజాలు (58) అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని వాటర్ ట్యాంకు వద్ద కూర్చుని పక్కనే ఉన్న వారితో మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. గమనించిన  స్థానికులు వెంటనే అక్కడే విధుల్లో ఉన్న  ఎస్సై  కొంక అశోక్ కి సమాచారం అందించగా, ఎస్సై చేరుకొని వెంటనే సిపీఆర్ చేశాడు. ప్రాణాన్ని నిలిపేందుకు తన శాయశక్తుల ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. వెంటనే 108 సిబ్బంది చేరుకొని అతన్ని పరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దీంతో ఎస్సై అశోక్ మృతదేహాన్ని తన స్వహస్తాలతో ట్రాక్టర్ లో వేసి అతని ఇంటికి చేర్చారు. ఈ సందర్భంగా స్థానికులు ఎస్సై అశోక్ నీ అభినందించారు.