17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

శ్రద్ధగా విద్యను అభ్యసించి ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలి

04-12-2025 08:48 PM

విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ 

ఎంపీడీవో తహెరా బేగం

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో వసతి గృహంలో బీసీ బాలికల, బీసీ బాలుర వసతి గృహాలలో ఉలేను దుప్పట్ల పంపిణీ చేసినట్లు వసతి గృహ నిర్వాహకులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున వసతి గృహంలో ఎల్లారెడ్డి ఎంపీడీవో తహెరా బేగం ఎంపిఓ ప్రకాష్ ఆధ్వర్యంలో బీసీ బాలుర వసతి గృహంలో ఉంటున్న 53 మంది విద్యార్థులకు బిసి బాలికల వసతి గృహంలో 140 మంది బాలికలకు ఊలేన్ దుప్పట్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో తాహెరా బేగం తెలిపారు.

అనంతరం ఆమె, వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యను ప్రతిష్టాత్మకంగా అందిస్తుందని విద్యార్థులకు చలికాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు దుప్పట్లతోపాటు నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య చదువుకోవడానికి సరిపడు పుస్తకాలు అన్ని ఉచితంగా పంపిణీ చేస్తుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రకాష్ బీసీ బాలుర వసతి గహ నిర్వాహకులు సాయిరెడ్డి, బీసీ బాలికల వసతి గృహ నిర్వాహకురాలు విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.