9 April, 2026 | 8:29 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

కాంగ్రెస్ అంటేనే.. పేదల సర్కార్

13-11-2025 07:09 PM

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే జీఎస్సార్..

భూపాలపల్లి/రేగొండ/చిట్యాల (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ అంటేనే పేదల సర్కార్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఈ మేరకు ఎమ్మెల్యే గురువారం  భూపాలపల్లి పట్టణం,రేగొండ, చిట్యాల మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 100 మంది లబ్దిదారులకు రూ.30,94,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఆయా చోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.