3 July, 2026 | 11:55 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

03-05-2025 12:00 AM

నేరడిగొండ, మే 2 (విజయక్రాంతి): పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే నగదు ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.బోథ్ నియోజకవర్గ పరిధిలో ని లబ్దిదారులకు మంజూరైన  రూ. 2,42,000/- విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను  నేరడిగొండలో ఎమ్మెల్యే పంపి ణీ చేశారు.

ఈ సందర్భంగా తలమడుగు మండలంలోని ఉండం గ్రామానికి చెందిన చోటే ఖాన్‌కి రూ.45,000, నేరడిగొండ మండలంలోని తర్నం గ్రామానికి చెందిన కామెరి రాజేశ్వర్‌కి రూ.27,000, ఇచ్చొడ మండలంలోని ఆడిగావ్ (బి)కి చెందిన సావుబాయికి రూ.60,000,  సోనాల మండల కేంద్రానికి చెందిన బొరిగేపు సుశీలకి రూ.16,500,  బోథ్ మండలంలోని దన్నూ ర్ (బి) గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డికి రూ.25,500, రవికి రూ.41,500, నల్ల రాజేశ్వర్ రెడ్డికి రూ. 16,500, ముసుకు రాజేశ్వర్ రెడ్డికి రూ.10,000 చెక్కులను ఎమ్మెల్యే  లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, యువ నాయకులు దేవేందర్ రెడ్డి, అభిరాం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, జక్క శ్రీధర్ రెడ్డి, దివాకర్ రెడ్డి, రాజు, ఉన్నారు.