17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

17-05-2025 06:34 PM

60వ రోజు ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ పంపిణీ..

కల్లూరు (విజయక్రాంతి): సత్తుపల్లి ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు-పుష్పలత దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాధికారి నవ్య కాంత్ ఆధ్వర్యంలో శనివారం రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసినారు. కల్లూరు లైన్స్ క్లబ్ సెక్రటరీగా ఎన్నికైన కిన్నెర ఆనందరావు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం హర్షనీయమని డాక్టర్ నవ్య కాంత్ అన్నారు. 

లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ చలువాది నగేష్ కుమార్ మాట్లాడుతూ... సేవా రంగంలో ముందున్న ఆర్టీసీ ఆనంద్ సేవలు అభినందనీయమన్నారు. అనంతరం వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కల్పించాలి అని ఆర్టీసీ సిబ్బందికి, ప్రయాణికులకు కల్లూరు బస్టాండులో 60వ రోజు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల లయన్స్ క్లబ్ ట్రెజరర్ దారా శ్రీను, మాజీ అధ్యక్షులు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.