23 June, 2026 | 10:43 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ

30-10-2025 08:11 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మంజూరు పత్రాలను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు లబ్ధిదారులకు అందజేశారు. మండలంలో 63 మంది లబ్ధిదారులకు అధికారులతో కలిసి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. 8 నెలల్లో లబ్ధిదారులు ఇండ్లు పూర్తిచేసేలా చూసుకోవాలని తెలిపారు. ఆదివాసీలకు ఇల్లు మంజూరు చేయించడం నా బాధ్యత అని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని తెలిపారు.

అకాల వర్షంతో పత్తి,వరి పంటలు నష్టం వాటిల్లిందని  వారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక రోడ్లకు మరమ్మత్తులు చేసేలా కృషి చేస్తానని తెలిపారు. వంతెనలు మంజూరుకు నివేదికలు పంపించామని తెలిపారు. రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేశాక గూడెం వరకు బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. బాపు గూడ గ్రామానికి వంతెన రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి రెండు సిసి రోడ్లు మంజూరు కోసం కృషి చేస్తానని తెలిపారు. బెజ్జూరు మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, శంకర్ గౌరీ శంకర్ , మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, పార్టీ అధ్యక్షులు జాడి తిరుపతి, వశీవుల్లా ఖాన్, గూడ రాకేష్, బిక్షపతి, సామల తిరుపతి, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.