2 July, 2026 | 2:50 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

పాల్వంచ ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

01-05-2025 06:27 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఆశ్రమ బాలుర పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V. Patil) పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా పాఠశాలల్లోని ప్రతి తరగతి గదిని కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, చేయవలసిన మరమత్తులు గురించి పూర్తి వివరాలను ప్రధాన ఉపాధ్యాయులు బద్రుని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పునః ప్రారంభం నాటికి పాఠశాలల్లో అన్ని సమస్యలు, మరమ్మతులను పూర్తి చేయాలన్నారు.

పాఠశాల భవనానికి రంగులు వేయడం కోసం ఎంత ఖర్చవుతుంది, ఏ రంగులు వేయాలి తదితర విషయాలపై అధికారులతో చర్చించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఆశ్రమ పాఠశాలను ఎంపిక చేసి పాఠశాల భవనానికి రంగులు వేయాలన్నారు. అనంతరం ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు నూతన రంగులు వేసి పాఠశాలలో పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు నూతన హంగులతో స్వాగతం పలకాలన్నారు. ఈ పరిశీలనలో పాఠశాల సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.