9 April, 2026 | 7:04 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

జిల్లా కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు

03-01-2026 12:00 AM

కామారెడ్డి, జనవరి 2 (విజయక్రాంతి): నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కు జిల్లా అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో  శుక్రవారం పలువురు జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. సమీష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందేలా అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కొత్త సంవత్సరంలో జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అధికారులు జెడ్పీ సీఈఓ చందర్, సిపిఓ రఘునందన్, డి పి ఆర్ ఓ తిరుమల, సివిల్ సప్లై వెంకటేశ్వర్లు, డి ఎం శ్రీకాంత్, హార్టికల్చర్ జ్యోతి, dyso వెంకటేశ్వర గౌడ్, పిడి మెప్మ శ్రీధర్ రెడ్డి, deo రాజు, SC corporation వెంకటేశ్వర్లు, భూగర్భ జల శాఖ సతీష్, పిడి హౌసింగ్ విజయ పాల్ రెడ్డి, ఇండస్ట్రియల్ లాలూ, bc కార్పొరేషన్ , జయరాజ్, ఆడిట్ అధికారి  రామకృష్ణ, తదితరులు