18 July, 2026 | 6:22 PM

Breaking News

అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •  

పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించొద్దు

02-08-2025 02:30 PM

ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్..

సిద్దిపేట క్రైమ్: పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలగకుండా నడుచుకోవాలని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్(AR Additional DCP Subhash Chandra Bose) సిబ్బందికి సూచించారు. శనివారం సిద్దిపేట శివారులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో  జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీక్లీ పరేడ్ వల్ల ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వహించచ్చన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి జిల్లాకు, తెలంగాణ పోలిస్ శాఖకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సైబర్ నేరాలు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ లతో జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణికుమార్, కార్తీక్, పూర్ణచందర్, ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, ఉపేందర్, ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు సిద్దిపేట డివిజన్ పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.