12 July, 2026 | 3:13 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరణ

29-11-2025 12:22 AM

వలిగొండ, నవంబర్ 28 (విజయక్రాంతి): వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ కవి రెబ్బ మల్లికార్జున్ వలిగొండ శాఖా గ్రంథాలయానికి కథల పుస్తకాలు బహుకరించారు. కవి మల్లికార్జున్ ఇటీవల బాల సాహిత్యానికి సంబంధించిన “వినయశ్రీ” పేరుతో రాసిన బాలల కథల పుస్తకాలను గ్రంథాలయ ఇంచార్జ్ పిట్టల ఆంజనేయులుకు అందజేశారు. మల్లికార్జున్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే  విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడుతాయి. జ్ఞానాన్ని , విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించేవి గ్రంథాలయాలేనని అన్నారు.