17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

చిట్యాల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శివరామిరెడ్డి తనిఖీలు

11-11-2025 10:14 PM

చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ లో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. అంతేకాకుండా పోలీసులు అత్యవసర పరిస్థితులలో వినియోగించే వస్తువులను వాటి నాణ్యతను పరీక్షించారు. గ్రామ పోలీసు అధికారులు, ఆయా గ్రామాల ప్రజలకు నేరాలపైన ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు శాంతి భద్రతలపై అవగాహన కల్పించాలని, నేరాలు జరగకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నార్కెట్ పల్లి సీఐ కే నాగరాజు ఎస్సై ఎమ్ రవికుమార్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.