8 June, 2026 | 9:34 PM

Breaking News

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •   సమస్యలను తెలుసుకున్నందుకే బుల్లెట్ పై ప్రయాణం   •   తాజా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ రోడ్డు ప్రమాదంలో మృతి   •   కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తే బీఆర్ఎస్ చేర్చుకుంది   •   పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి   •   ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి   •   పోలంపల్లి చెరువులో అనుమతుల ముసుగులో మట్టి మాఫియా   •   కాలనీలో నూతన నీటి పైపులైన్ ఏర్పాటుచేసి, తాగునీటి సరఫరాను మెరుగుపరచాలి   •  

రామప్పలో బాంబు స్క్వాడ్ తో తనిఖీలు

11-11-2025 10:54 PM

వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర భద్రతా, నిఘా విభాగాల సూచనల మేరకు మంగళవారం సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వద్ద పోలీసులు హై అలర్ట్‌లో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ సిబ్బందితో పాటు పోలీసు జాగిలాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ ప్రాంగణం, పార్కింగ్ స్థలం, పర్యాటకుల వాహనాలను కూడా పరిశీలించారు. భక్తులు, పర్యాటకుల రాకపోకలను పర్యవేక్షిస్తూ అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.