25-09-2025 01:03:25 AM
మహదేవపూర్, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో బుధవారం కాటారం డిఎస్పి సూర్యనారాయణ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సీఐ కార్యాలయంలో పలు రికార్డులను కేస్ ఫైల్స్ ను తనిఖీ చేశారు. నేర నియంత్రణలో ముందుండాలని విచారణ ప్రక్రియలో కచ్చితత్వం పాటించాలని సిఐ ఎస్ఐ లకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు. ఎస్త్స్ర పవన్ కుమార్, ప్రొబేషనరీ ఎస్త్స్ర సాయి శశాంక్, సిబ్బంది పాల్గొన్నారు.