17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

డయేరియా నివారణకు ఆరోగ్య శిభిరం ఏర్పాటు చేయాలి

27-01-2026 06:22 PM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్

మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో డయేరియా కేసులు పూర్తిగా నివారించే వరకు ఆరోగ్య శిబిరం నిర్వహించాలని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. జడ్పీ సిఈఓ శిరీష, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ, తహసీల్దార్ వెంకన్న, ఎంపిడిఓ ఆంజనేయులు, మెడికల్ అధికారి భవాని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి భూలక్ష్మిలతో కలెక్టర్ ఛాంబర్ నుండి టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు.

వైద్య ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ రాజ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  వైద్య సిబ్బంది,పారా మెడికల్ సిబ్బంది 24x7 విధుల్లో ఉండాలని ఆదేశించారు. వ్యాధుల వ్యాప్తిని అడ్డుకునేందుకు స్వచ్ఛమైన త్రాగు నీటి వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత అలాగే ముందస్తు నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

గత గురువారం రోజున సిరికొండ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి విరోచనాలతో బాధపడటంతో ఆశ కార్యకర్త గుర్తించి మెరుగైన చికిత్స కొరకు మోతె ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి చికిత్స అందించటం జరిగింది. గత 3 రోజులలో 50 మందికి చికిత్సను అందించటం జరిగినదని, వీరంతా మిరప తోటలో పనికి వెళ్ళి అక్కడ కలుషితమైన నీటిని త్రాగుట వలన అస్వస్థతకు గురైన విషయం తెలుసుకోవడంతో నీటి నమూనాలను పరీక్షల కొరకు పంపించటం జరిగినదని, అధికారులు  కలెక్టర్ కి వివరించారు. అధికారులు, గ్రామస్తులు సమన్వయం చేసుకుంటూ అస్వస్థకు గురైన ప్రజలు త్వరగా కోలుకునేలా చూడాలని  కలెక్టర్ కోరారు.