13 April, 2026 | 11:28 AM

Breaking News

గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •   పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం   •   తట్టేపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్   •  

నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లు

26-12-2024 12:11 AM

పీకేఎల్ 11వ సీజన్

పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. నేడు జరగనున్న ఎలిమినేటర్ పోరులో తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్,  రెండో మ్యాచ్‌లో యు ముంబాతో పట్నా పైరేట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఎలిమినేటర్‌లో నెగ్గిన జట్లు సెమీస్‌లో హర్యానా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీతో ఆడనున్నాయి. నేటి మ్యాచ్‌ల్లో బలంగా కనిపిస్తున్న యు ముంబా, యూపీ యోధాస్ ఫేవరెట్‌గా ఉన్నాయి. ఇక ప్లేఆఫ్స్ చేరిన ఆరు జట్లలో హర్యానా, యూపీ యోధాస్ ఇంతవరకు ఒక్కసారి కూడా చాంపియన్స్ కాలేదు. పట్నా పైరేట్స్ మూడుసార్లు, జైపూర్ రెండుసార్లు, యు ముంబా, దబంగ్ ఢిల్లీ ఒక్కోసారి పీకేఎల్ టైటిల్ నెగ్గాయి.