13 June, 2026 | 2:55 PM

Breaking News

న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న సీఆర్‌పీలు   •   ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల ఇంటికి సిట్   •   జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్   •   సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య   •   అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •  

రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో నేపాలీ ముఠా దోపిడీ

16-11-2025 02:48 PM

హైదరాబాద్: కర్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్ రాక్ ఎన్‌క్లేవ్‌లో నేపాలీ ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. దాదాపు రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ గిరి (76) ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ వ్యక్తి, నలుగురు సహచరులతో కలిసి దొంగతనం చేయడానికి కుట్ర పన్నాడు.

ఆ ముఠా ఇంట్లోకి చొరబడి, ఇంటి యజమాని గిరిపై కర్రలతో దాడి చేసి, కట్టివేసి, ఆవరణను దోచుకెళ్లారు. స్థానికులు సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాదాపు 25 తులాల బంగారం, 23 లక్షల నగదు దొంగిలించబడ్డాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.