15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మరో సారీ మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు

16-11-2025 04:16 PM

మంథని,(విజయక్రాంతి): మరో సారీ గొప్ప మానవత్వం చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకొని నిండు ప్రాణాన్ని కాపాడారు. స్థానికుల వివరాల ప్రకారం మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం శివారులో గల పెట్రోల్ పంపు దగ్గర శనివారం సాయంత్రం ప్రధాన రహదారిపై బైక్ ను టిప్పర్ ఢీకొట్టింది. 


ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో మంథని నియోజకవర్గం లోని కాటారం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని అటుగా వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు తన కాన్వాయ్ ను వెంటనే నిలిపి వేసి, వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. క్షతగాత్రులను కలిసి మనోధైర్యం చెప్పారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్న మానవత్వ స్పూర్తిని స్థానికులు కొనియాడారు.