వరంగల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో సోమవారం రాత్రి ఒక ఇంజినీరింగ్ విద్యార్థి(Engineering student) ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ వర్మ అనే విద్యార్థి నగరంలోని బోల్లికుంటలో ఉన్న వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. మామ్నూరులోని తన అద్దె గదిలో అతను సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. అతని స్వస్థలం పెద్దపల్లి జిల్లా(Peddapalli district). అతను నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళ్లి, రెండు రోజుల క్రితం కళాశాలకు తిరిగి వచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం అతను ఈ తీవ్రమైన చర్య తీసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.




