07-01-2026 08:47:01 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుసాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల ఎంపీటీ స్థానం ఎస్సీ రిజర్వేషన్ చేయాలని కోరుతూ సిరిసిల్ల ఆర్డిఓ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు సావనపల్లి బాలయ్య, కురుమ రాజయ్య, వార్డు మెంబర్లు మునగ మల్లేశం, మునిగే శంకర్, తక్కల్ల కుశాల్, మల్లారం నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గాలకు న్యాయం చేయాలని నాయకులు ఈ సందర్భంగా కోరారు.