9 May, 2026 | 3:39 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

కలం స్నేహం సాహితీ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

09-09-2025 05:24 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా హైస్కూల్లో మంగళవారం తెలుగు సాహిత్య పితామహుడు కాళోజి జన్మదినాన్ని పురస్కరించుకొని కలం స్నేహం సాహితీ సంస్థ మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షురాలు హనుమాండ్ల రమాదేవి(District President Hanumandla Ramadevi) ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. తెలుగు బాషా దినోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహించినట్లు చెప్పారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు లాస్య, సుశాంత్, వర్షిత,అనిరుద్ లతోపాటు మరి కొంతమంది విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలం స్నేహం సాహితీ సంస్థ గౌరవ అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ, తెలంగాణ మాండలికానికి సాహిత్య గౌరవాన్ని కల్పించిన ఒక గొప్ప కవిగా కాళోజీ నారాయణరావు సాహిత్య పుటల్లో నిలిచిపోయారన్నారు.

ఆయన ప్రస్థానం తెలుగు సాహిత్యానికే మార్గ నిర్దేశమని అన్నారు. నైజాం వ్యతిరేక పోరాట ఉద్యమంలో క్రియాశీలకంగా నిలిచిన కాళోజీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమాలను ఉరకలెత్తించారన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రతినిధిగా తన సాహిత్యానికి పదును పెట్టి ఉద్యమకారులకు దారి చూపారన్నారు. కాళోజి తెలుగు సాహిత్య, ఉద్యమ జీవితం తెలంగాణ బిడ్డలెందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రఘుబాబు ,కలం స్నేహం సాహితీ సంస్థ అధ్యక్షురాలు కొత్తపల్లి సమత, సింధుజ, సునీత,తెలుగు ఉపాధ్యాయురాలు భబిత , ఉపాధ్యాయులు శంకర్ పాల్గొన్నారు.