12 May, 2026 | 11:16 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ఎగ్జిక్యూటివ్ పిటిషన్ లు త్వరగా పూర్తి చేయాలి

09-09-2025 10:17 PM

జిల్లా జడ్జి యం.ఆర్. సునీత..

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలో భూసేకరణకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పిటిషన్ లు త్వరగా పూర్తి చేయాలని జిల్లా జడ్జి యం.ఆర్. సునీత జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi)ను సూచించారు. ప్రమాదవశాత్తు కాలి గాయంతో బాధపడుతూ విధులు నిర్వహిస్తున్న జిల్లా జడ్జి యం.ఆర్. సునీతను మంగళవారం జిల్లా కలెక్టర్ కోర్టులో పరామర్శించారు. అదేవిధంగా భూసేకరణ రైతులకు సంబంధించి చాలాకాలం నుండి పెండింగ్ లో ఉన్న 587 ఇ.పి లకు గాను  280 ఇ.పి. లకు సంబంధించిన  చెక్కును జిల్లా జడ్జికి అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, ఇటీవల ఆర్డీఓ సుబ్రమణ్యం వచ్చిన తర్వాత ఈ.పి కేసులు, ఇతరత్రా భూ సమస్యలు త్వరగా కొలిక్కి వస్తున్నాయని ఆర్డీఓను అభినందించారు. మిగిలిన ఈ.పి లు సైతం త్వరగా పూర్తి చేయాలని సూచించారు.