01-12-2025 12:19:31 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అల వర్చుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివా రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని అమ్మవారి దేవాలయం వద్ద మదర్ ల్యాండ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఓల్ ఏజ్ హోమ్ ఫర్ ఆర్పన్స్ చైర్మన్ ఆలీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.
ప్రతి నెల చివరి రోజు అన్నదానం కార్యక్ర మం చేపట్టి పేదలకు అండగా నిలుస్తున్న సొసైటీ చైర్మన్ ఆలీని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం సొసైటీ చైర్మన్ ఆలీ ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ బీఆర్ఎస్ మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, సొసైటీ ప్రతినిధులు వై. మల్లేష్, వెంకటేష్ కే. శ్రీనివాస్, బాలయ్య యాదవ్, ఎస్.కె రషీద్, సంతు తదితరులు పాల్గొన్నారు.