11-08-2024 06:41:24 AM
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): హైదరాబాద్లో తమ సంస్థ విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ ముందుకువచ్చింది. హైదరాబాద్లోని తమ పరిశోధనఅభివృద్ధి సంస్థను విస్తరించే అంశంపై సీఎం రేవంత్రెడ్డి బృందంతో సంస్థ ప్రతినిధులు చర్చిం చారు. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న రేవంత్రెడ్డిని కలిశారు. హైదరాబాద్లో తమ ఆర్ అండ్ డీ సంస్థకు అనుబంధంగా స్వయం ప్రతిపత్తి ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
హైటెక్, పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టి సారించామని, మోనా ర్క్ ట్రాక్టర్స్ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. స్వయం ప్రతిపత్తి, ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామని, ఆ విజన్లో మోనార్క్ ట్రాక్టర్స్ భాగమై రాష్ట్రం లో తమ ఉనికిని విస్తరించుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ కార్యక లాపాలపై చర్చించేందుకు సీఎం రేవంత్రెడ్డిని, ఇతర అధికారులను కలవడం ఎంతో సంతోషంగా ఉన్నదని మోనార్క్ ట్రాక్టర్స్ సీఈవో ప్రవీణ్ పెన్మెత్స వెల్లడించారు.
హైదరాబాద్లోని తమ ఆర్అండ్డీ కేంద్రం అధునాతన డ్రైవర్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను రూపొందించడంలో కీలకపాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు తాము చూస్తున్నామని, ఫలితంగా హైదరాబాద్ ప్రాంతంలో మరింత ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి స్వయం ప్రతిపత్తి, డ్రైవర్తోనూ, డ్రైవర్ లేకుండానే నడిచే స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లతో మోనార్క్ ట్రాక్టర్స్ సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.