10-05-2024 12:55:09 AM
8 మంది మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు
తమిళనాడులోని శివకాశిలో ప్రమాదం
విరుధానగర్, మే 9: పటాకుల తయారుచేసే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవిం చింది. ఈ ఘటన తమిళనాడులోని విరుధానగర్లోని శివకాశీలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం సమయం లో ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని, ఆ శబ్దాలు కిలోమీటర్ మేర వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద తీవ్రతకు ఫ్యాక్టరీకి చెం దిన ఏడు గదులు పూర్తిగా ధ్వంస మయ్యా యి. ప్రమాద స్థలంలో భారీగా తెల్లటి పొగ లు కమ్మేశాయి. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే ప్రమాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించానని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందిం చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు వెల్లడించారు. మృతులు, క్షతగాత్రులకు ఈసీ అనుమతితో నష్టపరిహారం ఇస్తామని చెప్పారు.