26-06-2024 12:05:00 AM
తెలంగాణలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభు త్వ, సంక్షేమ పాఠశాలలు ముఖ్య భూమిక పోషిస్తాయి. అయితే, ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు వసతులు మెరుగు పరచాలి. స్కూళ్లల్లో మరుగుదొడ్ల సమస్యలు, ఇతరేతర మరమ్మతు పనులు వర్షాలకు ముందే పూర్తి చేయాలి. స్కూళ్ల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కనీస సౌకర్యాలు తీరినప్పుడే పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు రావడానికి ఇష్టపడుతుంటారు.
-తలారి గణేష్