23 April, 2026 | 2:56 PM

Breaking News

సమాంతర అభివృద్ధి మా లక్ష్యం   •   నరేంద్ర మోదీపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై నిరసన   •   హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు బట్టబయలు   •   గుర్వాయిగూడెంలో అక్రమంగా మట్టి తరలింపు.. జేసీబీతో సహా 8 ట్రాక్టర్లు సీజ్   •   Karnataka SSLC Result 2026 Out: కర్ణాటక SSLC ఫలితాలు విడుదల   •   బెంగాల్ ఎన్నికలు: 11 గంటల వరకు 41.11 శాతం పోలింగ్.. ముర్షిదాబాద్‌లో ఘర్షణలు   •   తమిళనాడులో 11 గంటల వరకు 37.56 శాతం పోలింగ్   •   ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే... సచివాలయం ముట్టడిస్తాం   •   తెలంగాణ‌లో రెండోరోజు ఆర్టీసీ స‌మ్మె.. మెట్రోలకు పోటెత్తిన ప్రయాణికులు   •   భగీరథుని ప్రయత్నం చరిత్రలో మహత్తర ఘట్టం   •  

క్యాన్సర్ రోగులకు పింఛను

26-06-2024 12:05 AM

రాష్ట్రంలో కొత్తగా ఇచ్చే ‘చేయూత’ పథకంలో భాగంగా క్యాన్సర్ రోగులకు రూ. 6,000 పింఛన్ ఇవ్వాలి. దురదృష్టవశాత్తు ఈ మహమ్మారి బారిన పడిన రోగుల కుటుంబాలు ఆర్థికంగా బాగా చితికిపోతున్నాయి. వైద్య ఖర్చులకు, నెలవారీ మందుల కోసం సర్కారు ఇచ్చే పింఛన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చావు రోజులను లెక్కిస్తూ జీవిస్తున్న రోగులను ప్రభుత్వం ఈ రకంగా ఆదుకోవాలి. దీనివల్ల బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చినట్టవుతుంది. నాణ్యమైన పౌష్టిక ఆహరం తీసుకోవడానికీ ఆ సొమ్మును ఉపయోగించుకోగలరు. తద్వార వారి జీవిత కాలాన్ని కొంతమేర పెంచిన వారమవుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం.

 -గుండమల్ల సతీష్ కుమార్