03-06-2025 05:45:32 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. మంగళవారం నిర్మల్ రూలర్ మండలంలోని అక్కాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ ఉన్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు తాగునీటి నల్లాలను పరిశీలించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తాసిల్దార్ సంతోష్ కుమార్ అధికారులు ఉన్నారు.