17 April, 2026 | 11:02 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధిక తూకం వేస్తున్నారని రైతుల ఆందోళన

13-05-2025 05:16 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వ చింతల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధిక తూకం వేస్తూ క్వింటాల్కు 8 కిలోల వడ్లు దోపిడీ చేస్తున్నారని పిఎసిఎస్(PACS) కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మంగళవారం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సహకార సంఘం చైర్మన్ తో మాట్లాడగా అధిక తూకం విషయంలో ఎటువంటి సమాధానం ఇవ్వకపోగా అక్కడికి వచ్చిన సెక్రటరీనీ బంధించి ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్పందించి తగు విచారణ జరిపించాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎర్వ చింతల్ గ్రామ రైతులు పలువురు పాల్గొన్నారు.