15-09-2025 12:00:00 AM
గద్వాల్ టౌన్ సెప్టెంబర్ 14 పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ప్రైవేట్ కళాశాలలకు వెంటనే విడుదల చేయాలని బి ఆర్ ఎస్ వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో సోమవారం నుంచి ప్రైవేట్ కళాశాలలు బందు పిలుపునిచ్చాయని,ఈ బంద్కు బి ఆర్ ఎస్ వి మద్దతు ఇస్తుందని తెలిపారు. రీయింబర్స్మెంట్ ఆలస్యం కారణంగా పేద,మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.