17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మహిళా మావోయిస్టు ఎన్‌కౌంటర్

07-05-2025 12:00 AM

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో ఘటన

ఘటనా స్థలంలో లభించిన 303 రైఫిల్ 

సుక్మాలో ఇన్‌ఫార్మర్ నెపంతో ఆదివాసీ హత్య

రాయ్‌పూర్, మే 6: తెలంగాణ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందినట్టు సీనియర్ పోలీస్ అధికారి మంగళవారం పేర్కొన్నారు. సోమవారం రోజు కర్రెగు ట్టల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ మీడియాకు వివరించారు. కర్రెగుట్టల ప్రాంతంలో పోలీసులు కూం బింగ్ మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు నలుగురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమ య్యాయి. గత రెండు వారాల నుంచి పోలీసులు పెద్ద ఎత్తున యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ చేపడుతున్నారు. 

తాడుతో గొంతుకోసి ఆదివాసీ హత్య

సుక్మాలో మావోయిస్టులు బుచి కి రాముడు అనే ఆదివాసీ గిరిజనుడిని హతమార్చారు. తారలగూడ గ్రామ ఉప సర్పంచి రాముడు సో మవారం సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇం టి వద్ద ఉండగా, సాధారణ వస్త్రధారణలో వచ్చిన ఐదుగురు మావో యిస్టులు, రాముడిని ఇంటి నుంచి లాక్కెళ్లి, తాడుతో గొంతు కోసి హత్య చేశారు. ఇన్‌ఫార్మర్ నెపంతో అతన్ని హతమార్చినట్టు తెలుస్తోం ది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.