13 July, 2026 | 5:19 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

పోలీసుల అదుపులో దేవ్‌జీ సహా 50 మంది నక్సల్స్

29-11-2025 12:00 AM
  1. వారిని కోర్టులో హాజరు పరచాలి
  2. రేపు ఛత్తీస్‌గఢ్, దండకారణ్యం బంద్‌కు పిలుపు
  3. మావోయిస్టు పార్టీ డీకేఎస్‌జడ్‌సీ ప్రకటన

హైదరాబాద్, నవంబర్ 28(విజయక్రాంతి): మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ సహా మరో 50 మంది పో లీసుల అదుపులో ఉన్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జడ్‌సీ) పేర్కొంది. వారందరినీ కోర్టు లో హాజరుపరచాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం డీకేఎస్‌జడ్‌సీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22తో ఉన్న ఆ ప్రకటన గురువారం సోషల్ మీడియాలో వెలుగుచూసింది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ మా రేడుమిల్లి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ అప్పుడే దేవ్‌జీ సహా మరో 50 మందిని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30(ఆదివారం)న ఛతీస్‌గఢ్, దండకారణ్య బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.