22 May, 2026 | 9:01 PM

Breaking News

చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •  

నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు లేకుండా చూడాలి: కలెక్టర్

29-11-2025 12:00 AM

తాండూరు, 28 నవంబర్, (విజయక్రాంతి) : సర్పంచ్ మరియు వార్డు సభ్యుల పదవి కోసం అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ ప్రక్రియ తప్పులు పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు పాటించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. 

శుక్రవారం  ఆయన  పెద్దేముల్, యాలాల్ మండలాల్లో ఎంపీడీవోలు రతన్ సింగ్ , శ్రీనిజ లతో కలిసి నామినేషన్ల  ప్రక్రియను క్లస్టర్ల వారిగా పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులతో  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....   అవసరానికి అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని.... నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావలసిన ధృవ పత్రలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని ఆయన తెలిపారు. నామినేషన్ల ఫారాలను స్పష్టంగా చూసి వాటిల్లో ఏవైనా తప్పులు వుంటే సరిచేసుకునే విధంగా అభ్యర్థులకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.

ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు.   గ్రామపంచాయతీలో పోటీ చేసే అభ్యర్థలకు వ్యయాలకు సంబంధించి  బ్యాంకు ఖాతలు ఉండాలని ఆయన సూచించారు.  సర్పం, వార్డు మెంబర్లు నిబంధనలకు అనుగుణంగానే ఖర్చులు పెట్టాలనే విషయము అభ్యర్థులకు స్పష్టంగా తెలియ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఇంకా కలెక్టర్ వెంట రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.