4 April, 2026 | 7:30 AM

సామాజిక సేవలో భాగస్వాములు కావాలి

29-11-2025 12:00 AM

కామారెడ్డి, నవంబర్ 28,(విజయ క్రాంతి): సామాజిక సేవలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని హెడ్మాస్టర్ హనుమాన్లు సూచించారు. ధర్మారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003 - 04 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమయం ఏర్పాటు చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను సన్మానించారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంకం రాజు, జమీర్ ,రమేష్ రెడ్డి ,రాజ్యలక్ష్మి సమీనా పాల్గొన్నారు.