13 April, 2026 | 11:42 AM

Breaking News

నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •   పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం   •  

క్లాస్‌మేట్ కుటుంబానికి రూ.41,600 అందజేత

13-12-2025 08:46 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ కుర్ణ నగేష్ పది రోజుల క్రితం హఠాన్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నగేష్ క్లాస్‌మేట్స్ ఆ కుటుంబానికి అండగా నిలవాలని తలిచారు. ఈ మేరకు కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ పాఠశాలలో నగేష్ తో కలిసి పదో తరగతి వరకు చదువుకున్న 1991-92 టెన్త్ క్లాస్ విద్యార్థులు సంఘటితమై సేకరించిన 41,600 రూపాయలను శనివారం నగేష్ కుటుంబ సభ్యులకు అందజేసి అండగా నిలిచారు.